వ్యూహం..

2 Jun, 2023 00:29 IST|Sakshi
అజ్మల్‌

రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో రామధూత క్రియేషన్స్‌ పతాకంపై దాసరి కిరణ్‌ నిర్మిస్తున్న చిత్రానికి ‘వ్యూహం’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ చిత్రంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాత్రలో అజ్మల్‌ నటిస్తున్నారు.

‘‘అహంకారానికి, ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం నేపథ్యంలో ‘వ్యూహం’ రూపొందుతోంది. ఇది బయోపిక్‌ కాదు.. బయోపిక్‌ కన్నా లోతైన రియల్‌ పిక్‌. బయోపిక్‌లో అబద్ధాలు ఉండొచ్చు కానీ, రియల్‌ పిక్‌లో నూటికి నూరు పాళ్లు నిజాలే ఉంటాయి’’ అని మేకర్స్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు