లాక్‌డౌన్‌లో ఏం జరిగింది?

29 Nov, 2020 00:18 IST|Sakshi

‘లాక్‌డౌన్‌ తర్వాత థియేటర్స్‌లో విడుదలయ్యే తొలి సినిమా మాదే’ అంటున్నారు దర్శకులు రామ్‌గోపాల్‌ వర్మ. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘కరోనా వైరస్‌’. కరోనా వైరస్‌ వల్ల ఏర్పడ్డ లాక్‌డౌన్‌లో చిక్కుకున్న ఓ కుటుంబం ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. శ్రీకాంత్‌ అయ్యంగర్‌ కీలక పాత్ర చేశారు. అగస్త్య మంజు దర్శకత్వం వహించారు. ‘‘డిసెంబర్‌ 11న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇదో నిజజీవిత హారర్‌ కథా చిత్రం’’ అన్నారు వర్మ.

మరిన్ని వార్తలు