‘ఐస్క్రీమ్, ఐస్క్రీమ్ 2’ వంటి చిత్రాల తర్వాత రామ్గోపాల్ వర్మ- తుమ్మలపల్లి రామసత్యనారాయణ కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా ప్రకటన వచ్చింది. 2014 జూలై 14న ‘ఐస్క్రీమ్’ సినిమా విడుదలైంది. ఈ చిత్రం విడుదలై ఏడేళ్లయిన సందర్భంగా రామ్గోపాల్ వర్మ, తన కాంబినేషన్లో మూడో సినిమాను ప్రకటించారు రామసత్యనారాయణ.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఐస్క్రీమ్’ చిత్రం నిర్మాతగా నా స్థాయిని పెంచడంతోపాటు నా జాతకాన్ని కూడా మార్చింది. అతి త్వరలో ఆర్జీవీ దర్శకత్వంలో మూడో సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాను. ఆర్జీవీ నాపై చూపించే అభిమానానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అన్నారు.