మెగా అల్లుడి సినిమా.. స్టోరీ లైన్‌ ఇదే!

31 Dec, 2021 07:55 IST|Sakshi

కల్యాణ్‌ దేవ్‌ హీరోగా, మహతి భిక్షు, కశిష్‌ ఖాన్, శీతల్‌ ఇతర ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘కిన్నెరసాని’. సాయి రిషిక సమర్పణలో రమణతేజ దర్శకత్వంలో రజినీ తాళ్లూరి, రవి చింతల నిర్మించిన ఈ చిత్రం జనవరి 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘కిన్నెరసాని’ ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో రమణ తేజ మాట్లాడుతూ – ‘‘మిస్టరీ అంశాలతో సాగే బ్యూటీఫుల్‌ లవ్‌స్టోరీ ఇది. ట్రైలర్‌లో ప్రేక్షకులకు కనిపించినది ఐదు శాతం మాత్రమే. సినిమాలో చాలా కథ ఉంది. ఈ కథను, నన్ను నమ్మి నాకు చాన్స్‌ ఇచ్చిన నిర్మాత రామ్‌ తాళ్లూరి గారికి ధన్యవాదాలు’’ అన్నారు.

‘‘ఇందులో ఐదు కథలు ఉంటాయి. ఐదు కథల్లోని ఐదు పాత్రలూ ముఖ్యమైనవే. హీరో ఎవరు? హీరోయిన్‌ ఎవరు? విలన్‌ ఎవరు అని చెప్పలేం. కథే హీరో. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేద్దామనుకున్నాం కానీ జీ5 వారు చూసి, అగ్రిమెంట్‌ చేసుకున్నారు. బిగ్‌ స్క్రీన్‌పై కూడా ఈ సినిమా బాగుంటుందని వారు అనడంతో థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం. కొత్త దర్శకులతో నేను చేయనున్న సినిమాలను సంక్రాంతికి ప్రకటిస్తా’’ అని రామ్‌ తాళ్లూరి అన్నారు. కశిష్‌ ఖాన్, మహతి భిక్షు, శీతల్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు