Rana Naidu: వెంకటేశ్‌తో తొలిసారి స్క్రీన్ పంచుకోనున్న రానా

22 Sep, 2021 10:45 IST|Sakshi

Rana Daggubati, Venkatesh Announce Netflix Series RanaNaidu: 'మా అంకుల్‌(వెంకటేశ్‌)తో స్క్రీన్ పంచుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది' అంటూ రానా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. వీరిద్దరూ కలిసి ఓ వెబ్‌ సిరీస్‌ చేయనున్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ వార్తలు నిజమేనని తేలిపోయింది.

ఓ ఇంట్రెస్టింగ్‌ సబ్జెక్ట్‌తో రూపొందుతున్న ఈ వెబ్‌సిరీస్‌కు 'రానా నాయుడు' అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సిరీస్‌ నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఇక ఈ వెబ్‌ సిరీస్‌తో కాజల్‌ చెల్లెలు నిషా అగర్వాల్‌ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన నిషా వెబ్‌ సిరీస్‌తో మరోసారి స్కీన్‌పై కనిపించనున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. 

మరిన్ని వార్తలు