కొత్త కథకు సై

1 Sep, 2020 02:13 IST|Sakshi

వైవిధ్యమైన కథలు, పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించేందుకు హీరో రానా ఎప్పుడూ ముందుంటారు. మిహికా బజాజ్‌తో ఇటీవల ఏడడుగులు వేసి ఓ ఇంటివాడైన రానా తాజాగా ఓ కొత్త స్క్రిప్ట్‌కు పచ్చజెండా ఊపారు.  ‘గృహం’ చిత్రంతో ప్రేక్షకుల అభిమానంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన మిళింద్‌ రావ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. నిర్మాత ఆచంట గోపీనాథ్‌తో కలిసి సురేష్‌ ప్రొడక్ష¯Œ ్స ఈ చిత్రం నిర్మించనుంది. మిళింద్‌ రావ్‌ చెప్పిన కథ నచ్చి, వెంటనే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారట రానా. సూపర్‌ నేచురల్‌ యాక్షన్‌ అడ్వంచరస్‌ మూవీ ఇది. ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్‌కి మంచి ప్రాధాన్యం ఉంది.

మరిన్ని వార్తలు