‘ధీరుడు’గా మారబోతున్నారట రానా దగ్గుబాటి. ఆయన తదుపరి సినిమాకు ఈ టైటిల్ను పరిశీలిస్తున్నారని తెలిసింది. ‘గృహం’తో సక్సెస్ అందుకున్న తమిళ దర్శకుడు మిలింద్ రావ్ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యారు రానా. సూపర్ న్యాచులర్ థ్రిల్లర్గా ఈ సినిమా కథాంశం ఉండబోతోంది. ఇందులో చేతబడి వంటి విషయాలను చర్చించనున్నారట. ఈ సినిమాకు ‘ధీరుడు’ అనే టైటిల్ బావుంటుందని చిత్రబృందం భావిస్తోందని తెలిసింది. సురేశ్ ప్రొడక్షన్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మించనున్నాయి. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చిత్రీకరించనున్నారు వచ్చే ఏడాది షూటింగ్ ఆరంభం కానుంది.