తిరుపతిలో సందడి చేసిన రంగరంగ.. వైభవంగా మూవీ టీమ్‌ 

27 Aug, 2022 14:45 IST|Sakshi

సాక్షి, తిరుపతి: తిరుపతిలో రంగరంగ వైభవంగా చిత్ర యూనిట్‌ సందడి చేసింది. ఓ ప్రయివేటు హోటల్‌లో శుక్రవారం హీరో వైష్ణవతేజ్, హీరోయిన్‌ కృతికశర్మ, దర్శకుడు గిరిశాయ, నిర్మాత బీవీఎన్‌ ప్రసాద్‌ మీడియాతో మాట్లాడారు. తిరుపతి నుంచి వైజాగ్‌ వరకు చిత్ర ఫ్రీ ఈవెంట్‌ నిర్వహిస్తున్నామన్నారు. గత రెండు చిత్రాలకంటే భిన్నంగా ఈ చిత్రం ఉంటుందని, సెప్టెంబర్‌ 2న థియేటర్లలో సందడి చేస్తుందని వారు పేర్కొన్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.  

చదవండి: (Liger Movie: థియేటర్‌ వద్ద రచ్చ చేసిన పూరీ ఫ్యామిలీ)

మరిన్ని వార్తలు