వెబ్‌ సిరీస్‌లో...

26 Aug, 2020 02:28 IST|Sakshi

సమంత, కాజల్‌ అగర్వాల్, నిత్యామీనన్‌ వంటి కథానాయికలు ఇప్పటికే డిజిటల్‌ రంగంవైపు అడుగులు వేశారు. ఇప్పుడు ఈ జాబితాలోకి రాశీ ఖన్నా కూడా చేరనున్నారని టాక్‌. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో రెండు మూడు సినిమాలు అంగీకరించారామె. తాజాగా ఓ వెబ్‌ సిరీస్‌ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారట. ఆ వెబ్‌ సిరీస్‌ లైన్‌ బాగా నచ్చిందని, చిత్రీకరణలో పాల్గొనడానికి రాశీ ఖన్నా ఆసక్తిగా ఉన్నారని తెలిసింది.

మరిన్ని వార్తలు