కార్తీ డబుల్‌ యాక్షన్‌ మూవీ: హీరోయిన్‌గా రాశీ ఖన్నా

28 Apr, 2021 08:14 IST|Sakshi

హీరోయిన్‌ రాశీ ఖన్నా జోరు మాములుగా లేదు. తెలుగులో ‘పక్కా కమర్షియల్‌’, ‘థ్యాంక్యూ’ చిత్రాలతో పాటు  హిందీలో షాహిద్‌ కపూర్‌ నటిస్తున్న ఓ వెబ్‌ సిరీస్‌లో హీరోయిన్‌గా చేస్తున్నారు. తాజాగా తమిళంలో కార్తీ హీరోగా పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్దార్‌’ చిత్రానికి సై అన్నారు.

ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా నటించే చాన్స్‌ను రాశీ దక్కించుకున్నారు. మరో హీరోయిన్‌గా మలయాళ నటి రజిషా విజయన్‌ నటిస్తున్నారు. కార్తీ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో సిమ్రాన్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నట్లు సమాచారం.

చదవండి: బాలీవుడ్‌ హీరోతో రాశీ ఖన్నా రొమాంటిక్‌ పాటలు!

మరిన్ని వార్తలు