Rashmika Mandanna: జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన చాన్స్‌ కొట్టేసిన రష్మిక!

17 Jan, 2022 15:55 IST|Sakshi

పరిశ్రమలో అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది రష్మక మందన్నా. కన్నడ నుంచి తెలుగులోకి వచ్చిన రష్మిక సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌గా చక్రం తిప్పుతోంది. ఈ క్రమంలో పాన్‌ ఇండియా చిత్రాల్లో నటించే స్థాయికి ఎదిగింది. అంతేకాదు ఇండియన్‌ నేషనల్‌ క్రష్‌ 2019గా అరుదైన గుర్తింపు కూడా పొందింది ఈ భామ. ఇలా తన కేరీర్‌ గ్రాఫ్‌ను పెంచుకుంటూ వరస సినిమా ఆఫర్లతో దూసుకుపోతున్న రష్మిక తాజాగా మరో క్రేజీ ఆఫర్‌ వచ్చినట్లు తెలుస్తోంది.

చదవండి: ఆహాతో నాకు సంబంధం లేదు, గమనించగలరు: అల్లు శిరీష్‌ ట్వీట్‌ వైరల్‌

టాలీవుడ్‌ అగ్ర హీరో, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సరసన త్వరలోనే ఆడిపాడనుందట ఈ నేషనల్‌ క్రష్‌. కాగా ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ షూటింగ్‌తో బిజీ ఉన్న క్రమంలోనే తారక్‌ కొరటాల శివతో ఎన్టీఆర్‌ 30(#NTR30) సినిమా చేస్తున్న సంగతి తెలిసింసిందే. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కించే ఈ చిత్రంపై ఇటీవల చిత్ర బృందం అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మూవీలో ఎన్టీఆర్‌కు సరసన మొదట అలియా భట్‌, కియారా అద్వానీలు నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఈ జాబితాలో కథానాయికగా రష్మిక పేరు తెరపైకి వచ్చింది. ఈ మూవీ ఆనౌన్స్‌మెంట్‌ సమయంలో రష్మిక పుష్ప మూవీతో పాటు బాలీవుడ్‌ చిత్రాలతో బిజీగా ఉంది.

చదవండి: నా జిమ్‌ ట్రైనర్‌ టార్చర్‌ చేస్తుంటాడు, నేను ఆ చాన్స్‌ మిస్సయ్యా: రష్మిక

ఇక ఇప్పుడు పుష్ప విడుదల కావడం, హిందీలో ఆమె చిత్రాల షూటింగ్‌ చివరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ 30 కోసం రష్మికను సంప్రదించగా ఆమె ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడనుందట. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే దీనిపై ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. కాగా ప్రస్తుతం రష్మిక, విజయ్ తదుపరి సినిమాలో హీరోయిన్‌గా సంతకం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తెలుగులో ఆమె 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చేస్తోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాయిక ప్రధానమైన సినిమా కూడా ఒకటి చేయనుందని వినికిడి.

మరిన్ని వార్తలు