సక్సెస్‌మీట్‌లో కలుద్దాం: రవితేజ

8 Jan, 2021 12:07 IST|Sakshi

‘‘డాన్‌ శీను, బలుపు’ చిత్రాల తర్వాత గోపీచంద్, నా కాంబినేషన్‌లో వస్తున్న ‘క్రాక్‌’ హ్యాట్రిక్‌ హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను. మధు, అమ్మిరాజులకు ఈ చిత్రం పెద్ద హిట్‌ అయి బాగా డబ్బులు రావాలి. మళ్లీ ‘క్రాక్‌’ సక్సెస్‌మీట్‌లో కలుద్దాం’’ అన్నారు రవితేజ. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రవితేజ, శ్రుతీహాసన్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘క్రాక్‌’. సరస్వతి ఫిలింస్‌ డివిజన్‌పై బి. మధు నిర్మించిన ఈ సినిమా రేపు (శనివారం) రిలీజవుతోంది.

ఈ సందర్భంగా ‘క్రాక్‌’ ప్రీ రిలీజ్‌ వేడుకలో గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ – ‘‘సంక్రాంతి పండక్కి ముందే మాకు పెద్ద పండగ రానుంది. నాకు సినీ జీవితాన్నిచ్చిన రవితేజగారికి కృతజ్ఞతలు. మా ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ‘క్రాక్‌’ కచ్చితంగా హ్యాట్రిక్‌ అవుతుంది’’ అన్నారు. ‘‘సంక్రాంతి కానుకగా ఈ నెల 9న మా ‘క్రాక్‌’ భారీగా విడుదలవుతోంది. ఈ అవకాశం ఇచ్చిన మధు, రవితేజ, గోపీచంద్‌గారికి థ్యాంక్స్‌’’ అన్నారు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ అమ్మిరాజు. ‘క్రాక్‌’ మొదటి, రెండో టికెట్‌ను దర్శకులు వంశీ పైడిపల్లి, అనిల్‌ రావిపూడి కొనుగోలు చేశారు.  

మరిన్ని వార్తలు