Kiara Advani: పాన్‌ ఇండియా మూవీలో ఛాన్స్‌ కొట్టేసిన కియారా

31 Jul, 2021 11:25 IST|Sakshi

Ram Charan Shankar Movie Heroine: మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్ కాంబినేషన్‌లో పాన్‌ ఇండియా మూవీ  తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరన్న దానిపై ఇప్పటివరకు పలు రకాల పేర్లు వినిపించినా ఫైనల్‌గా బాలీవుడ్‌ భామ కియారా అద్వానీ ఆ ఛాన్స్‌ కొట్టేసింది. గతంలో వినయ విధేయ రామలో రామ్‌చరణ్‌తో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు మరోసారి జత కట్టనుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

జులై31న కియారా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా బర్త్‌డే విషెస్‌ తెలిపిన మూవీ టీం ఆమెను వెల్‌కం అబోర్డ్‌ అంటూ పోస్టర్‌ను విడుదల చేసింది. రామ్‌చరణ్‌ కెరీర్‌లో 15వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా అనౌన్స్‌ చేసినప్పటి నుంచి అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక మరో విశేషం ఏంటంటే..ఈ చిత్రంలో కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ సైతం ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌పై దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. 

మరిన్ని వార్తలు