Chiranjeevi : మాతృభూమి కలకాలం సుభిక్షంగా ఉండాలి.. చిరంజీవి ట్వీట్‌

26 Jan, 2023 10:55 IST|Sakshi

యావత్ దేశం 74వ గణతం​త్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటుంది. 1950లో భారత దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చి నిన్నటికి 73 సంవత్సరాలు పూర్తైంది. ఇవాళ 74వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ సందర్భంగా దేశభక్తిని చాటుకుంటూ ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా మెగాస్టార్‌ చిరంజీవి రిపబ్లిక్‌ డే సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

'మన భారతీయులందరికీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అమూల్యమైన స్వాతంత్ర్య బహుమతి కోసం మరియు ప్రపంచంలోని గొప్ప రాజ్యాంగాలలో ఒకటైన మా వ్యవస్థాపక తండ్రులను ప్రేమగా స్మరించుకుంటూ సెల్యూట్‌ చేస్తున్నాము.మన మాతృభూమి కలకాలం సుభిక్షంగా ఉండాలి' అంటూ చిరు ట్వీట్‌లో రాసుకొచ్చారు.  

మరిన్ని వార్తలు