స్పీకర్‌ ఆన్‌ చేసి మాట్లాడాలి 

23 Feb, 2023 02:33 IST|Sakshi

నవీన్‌ నేని, ప్రణీత పట్నాయక్‌ ముఖ్య తారలుగా కెఎస్‌ హేమరాజ్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘రిచిగాడి పెళ్లి’. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు దర్శకుడు హరీష్‌ శంకర్‌. ‘ఏ ఫోన్‌కాల్‌ వచ్చినా స్పీకర్‌ ఆన్‌ చేసి మాట్లాడాలి అంతే..!’, ‘రిచిగాడి పెళ్లి’ జీవితంలో మర్చిపోకూడదు’ అనే డైలాగ్స్‌ ట్రైలర్‌లో ఉన్నాయి. ‘‘మానవ సంబంధాలకు అద్దం పట్టే కథతో ‘రిచిగాడి పెళ్లి’ని రూపొందించాం’’ అన్నారు హేమరాజ్‌. 

మరిన్ని వార్తలు