దర్శకుడు మారారు

29 Aug, 2020 02:36 IST|Sakshi
‘రాంబో’లో..టైగర్‌ ష్రాఫ్‌

హాలీవుడ్‌ హీరో సిల్వెస్టర్‌ స్టాలోన్‌ సూపర్‌ హిట్‌ చిత్రం ‘రాంబో’ను కండలు తిరిగిన యంగ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌తో హిందీలో రీమేక్‌ చేయాలనుకున్నారు దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌. అయితే తాజాగా ఈ చిత్రాన్ని సిద్ధార్థ్‌ ఆనంద్‌ డైరెక్ట్‌ చేయడంలేదని ప్రకటన విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు డేవిడ్‌ ధావన్‌ తనయుడు, హీరో వరుణ్‌ ధావన్‌ సోదరుడు రోహిత్‌ ధావన్‌ ‘రాంబో’ను డైరెక్ట్‌ చేయనున్నారు.

ప్రస్తుతం షారుక్‌తో ఓ సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నారు దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌. దీంతో ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందట. కార్తీక్‌ ఆర్యన్‌తో ‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయనున్నారు రోహిత్‌ ధావన్‌. ఈ సినిమా తర్వాత ‘రాంబో’ని తెరకెక్కిస్తారు. ఈలోగా ‘హీరో పంతీ 2’ చిత్రాన్ని పూర్తి చేస్తారు టైగర్‌. 2021 చివర్లో ‘రాంబో’ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

మరిన్ని వార్తలు