RRR OTT Trailer: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఓటీటీ ట్రైలర్‌ చూశారా..

13 May, 2022 12:33 IST|Sakshi

RRR New Trailer: పాన్‌ ఇండియ బ్లాక్‌ బస్టర్‌ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ఓటీటీలోకి రాబోతున్న విషయం తెలిసిందే. మే 20న ప్రముఖ ఓటీటీ జీ5లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని  జీ5 విడుదల చేసింది. ఓరిజినల్‌ ట్రైలర్‌లో పలు మార్పులు చేసి ఓటీటీ ట్రైలర్‌ని వదిలారు. రామ్‌,భీమ్‌ కలుసుకోవడం.. వాళ్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం, ఇద్దరు కలిసి ఆంగ్లేయులపై దాడి చేసే దృశ్యాలను ట్రైలర్‌లో చూపించారు.

‘పాణం కన్నా విలువైన నీ సోపతి సా సొంతం అన్న’, ‘చాలా ప్రమాదం.. ప్రాణాలు పోతాయిరా’ ‘నాలో సగం ఎప్పుడూ నీతోనే ఉంటుంది’, ప్రతి తూట మీద సచ్చేవాడి పేరు రాసి ఉంటుంది..ప్రతి తూపాకి మీద పేల్చే వాడి పేరు రాసి ఉంటుంది, ‘యుద్దాని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి’ లాంటి డైలాగ్స్‌తో ట్రైలర్‌ని ఆసక్తికరంగా కట్‌ చేశారు. 

(చదవండి: ‘సర్కారు వారి పాట’ ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎంతంటే..)

కాగా, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ మల్టీస్టారర్‌గా, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ పాన్‌ ఇండియా చిత్రం ఈ ఏడాది మార్చి 25న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డుని సృష్టించింది. దాదాపు రెండు నెలల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి విడుదల అవుతుంది. మే 20న జీ5లో దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. 

మరిన్ని వార్తలు