అమృతను చూశాక విరాట్‌కు ఏమైంది?

24 Aug, 2020 11:10 IST|Sakshi

‘ప్రతి రోజు పండగే’ సినిమాతో బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ను అందుకున్న హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్‌ సినిమా చేస్తున్నాడు. మే 1న విడుదల కావాల్సిన ఈ సినిమా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. థియేటర్లు తెరుచుకోగానే త్వరలోనే విడుదల కానుంది. సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన ఫస్ట్‌ లుక్‌తోపాటు ‘నో పెళ్లి’ సాంగ్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పాటలో రానా, వరుణ్ తేజ్ కూడా సందడి చేయడం విశేషం. తాజాగా సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్‌ను హీరో ధరమ్‌ తేజ్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ట్విటర్‌లో పోస్టు చేశారు. (సాయి ధరమ్‌ తేజ్‌ ఆసక్తికర ట్వీట్‌)

‘సింగిల్స్‌ అంటూ చెప్పుకొచ్చిన నిఖిల్‌, నితిన్‌, రానా పెళ్లి చేసుకొని వెళ్లిపోయారు. ఇక నా వంతు వచ్చింది. సారీ ప్రభాస్‌ అన్న’. అంటూ సాగే వాట్సాప్‌ చాట్‌ను షేర్‌ చేశారు. ఇది చూసిన అభిమానులు ఇప్పటికే పెళ్లి బాట పడుతున్న హీరోల జాబితాలో సాయి కూడా చేరిపోయాడని అనుకున్నారు. అయితే ఈ వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ సోమవారం మరో ట్వీట్‌ చేశారు. ‘అంత స్ట్రిక్ట్‌గా సోలో బ్రతుకే సో బెటర్ అని అందరికీ చెప్పే విరాట్ కి అమృత ని చూసాక ఏమైంది ???.. సోలో బ్రుతుకే సో బెటర్‌ సినిమా నుంచి ఆగష్టు 26న  ‘హెయ్‌ ఇది నేనేనా’ అనే పాట విడుదల కానుంది’ అంటూ ట్విటర్‌లో ప్రకటించాడు. (భగవద్గీత సాక్షిగా..!)

అయితే ఇంతకు ముందు మెగా మేనల్లుడు కూడా నిజంగా పెళ్లి చేసుకుంటున్నాడేమోనని అనుకున్నఅభిమానుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. త్వరలో ధరమ్‌ తేజ్‌ కూడా ప​ప్పు అన్నం పెడతాడని ఊహించుకున్న వారికి నిరాశే ఎదురైంది. ఇక నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను నూతన దర్శకుడు సుబ్బు డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. తమన్‌ స‍్వరాలు సమకూరుస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా అనంతరం దేవ కట్టా దర్శకత్వంలో సాయిధరమ్‌ తేజ్‌ మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ('నో పెళ్లి' అంటున్న టాలీవుడ్‌ సింగ‌ర్స్‌)

మరిన్ని వార్తలు