అనుకోని అతిథి నిర్మాత కన్నుమూత

26 May, 2021 10:08 IST|Sakshi

కరోనా టైంలో తెలుగు చిత్రపరిశ్రమలో వరుస విషాదాలు సంభవిస్తున్నాయి. సింగర్​ ఆనంద్, స్టిల్ ఫొటోగ్రాఫర్ మోహన్‌జీ, రచయిత నంద్యాల రవి, ప్రముఖ ఇంటర్వ్యూ జర్నలిస్ట్​.. నటుడు టీఎన్ఆర్, పీఆర్వో బీఏ రాజులు కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఉదయం మరో విషాదం చోటుచేసుకుంది.
 
టాలీవుడ్ ప్రొడ్యూసర్​ అన్నంరెడ్డి కృష్ణకుమార్ ఈ తెల్లవారుఝామున గుండెపోటుతో కన్నుమూశారు. విశాఖపట్టణంలో ఈ ఉదయం ఆయన చనిపోయినట్లు తెలుస్తోంది. కృష్ణకుమార్​ తెలుగులో ప్రొడ్యూసింగ్ వహించిన ‘అనుకోని అతిథి’ సినిమా మరో రెండు రోజుల్లో ‘ఆహా’లో రిలీజ్​ కావాల్సి ఉంది. ఇంతలోనే ఆయన మృతి చెందడం ఆయన సన్నిహితుల్ని విషాదంలోకి నెట్టింది. కాగా, కృష్ణకుమార్​ మృతి విషయం తెలిసిన పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు.

ఫహద్​ ఫాజిల్​,  సాయి పల్లవి లీడ్ రోల్‌లో వివేక్​ డైరెక్ట్​ చేసిన సైకలాజికల్ థ్రిల్లర్‌ ‘అథిరన్​’. మలయాళంలో హిట్ అయిన ఈ మూవీ ‘అనుకోని అతిథి’ పేరుతో రిలీజ్​ చేస్తున్నారు. ఈ వెర్షన్​కి నిర్మాతల్లో అన్నంరెడ్డి కృష్ణ కుమార్‌ ఒకరు. గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు గమనించే లోపే ఆయన మృతి చెందినట్లు సమాచారం.కాగా, మూవీ స్ట్రీమింగ్​కు సరిగ్గా రెండు రోజుల ముందు కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 

మరిన్ని వార్తలు