-
తన డాన్స్తో, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిన హీరోయిన్ సాయి పల్లవి. మలయాళ చిత్రం ప్రేమమ్ ద్వారా కథానాయికగా పరిచయమైన ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే దక్షిణాదిన స్టార్ హీరోయిన్గా ఎదిగింది. టాలీవుడ్లో ఆమెకు ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఫిదా’మూవీతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ప్రస్తుత ఈ నాచురల్ బ్యూటీ నాగచైతన్యతో ‘లవ్స్టోరీ’, రానాతో ‘విరాటపర్వం’సినిమాల్లో నటిస్తుంది. అలాగే పవన్ కల్యాణ్తో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్లోనూ నటించబోతోంది.
ఇంత బిజీగా ఉన్న ఈ అమ్మడు.. త్వరలో ఓ ప్రయోగానికి సిద్దమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ హాస్యనటుడు కాళి వెంకట్ హీరోగా చిత్రం తెరక్కెనున్నట్లు కోలీవుడ్ కోడై కూస్తోంది. ఈ మేరకు చిత్రబృందం సాయి పల్లవిని సంప్రదించారట. సాయి పల్లవి ఒప్పుకోవడమే ఆలస్యం అని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఒప్పుకుంటే గనక కొత్త చరిత్ర సృష్టించినట్లు అవుతుంది. స్టార్ హీరోయిన్ గా ఉంటూ సపోర్టింగ్ యాక్టర్ పక్కన నటించడం అంటే చిన్న విషయం కాదు. మరి సాయి పల్లవి ఒప్పుకుంటుందో లేదో చూడాలి.