Sai Pallavi : 'మొటిమలతో ఇన్‌సెక్యూర్‌గా ఫీలయ్యా.. డైరెక్టర్స్‌ కూడా నన్ను బలవంతం చేయలేదు'

2 Apr, 2023 14:10 IST|Sakshi

హీరోయిన్‌ సాయిపల్లవి చేసింది తక్కువ సినిమాలే అయినా సూపర్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసు దోచుకుంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. గతేడాది గార్గి సినిమాతో ముందుకు వచ్చిన సాయిపల్లవి చాలారోజులుగా మీడియాకు కూడా దూరంగా ఉంటుంది.

అయితే తాజాగా ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌కు హాజరైన ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ.. తాను మేకప్‌ లేకుండా నటించడానికి గల కారణాలను బయటపెట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'నేను చిన్నప్పటి నుంచి చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్‌ అయ్యేదాన్ని. నా వాయిస్‌ బాగోదు, మొహంపై మొటిమలు ఇలా చాలా విషయాలు నన్ను భయపెట్టేవి. మొదట్నుంచి నేను పెద్దగా మేకప్‌ వాడలేదు.

నా మొదటి సినిమా ప్రేమమ్‌లో కూడా నేను మేకప్‌ లేకుండా నాచురల్‌గా కనిపించా. నిజానికి ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అని చాలా భయపడ్డా. కానీ సినిమా రిలీజ్‌ తర్వాత నన్ను నన్నుగా ప్రేక్షకులు ఇష్టపడ్డారు. నాకు వచ్చిన ఆదరణ చూసిన తర్వాత మరింత ఆత్మవిశ్వాసం వచ్చింది. అందుకే అప్పట్నుంచి సినిమాల్లో మేకప్‌ లేకుండానే నటించడానికి ఇష్టపడతాను. డైరెక్టర్స్‌ కూడా ఆ విషయంలో నన్ను ఎప్పుడూ మేకప్‌ వేసుకోవాలని బలవంత పెట్టలేదు' అంటూ చెప్పుకొచ్చింది. 

మరిన్ని వార్తలు