రీసౌండ్‌ రీస్టార్ట్‌

17 Nov, 2020 06:01 IST|Sakshi

సాయిరామ్‌ శంకర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రీసౌండ్‌’. రాశీ సింగ్‌ కథానాయిక. ఎస్‌.ఎస్‌. మురళీకృష్ణ దర్శకత్వంలో సురేష్‌ రెడ్డి, అయ్యప్పరాజు, రాజారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ సోమవారం పునః ప్రారంభమైంది. ‘‘ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. ‘రీసౌండ్‌’ టైటిల్‌ మాసీగా ఉండి ఆకట్టుకుంటోంది. మా సినిమా ఇప్పటివరకూ 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. తాజా షెడ్యూల్‌లో చిత్రంలోని ప్రధాన సన్నివేశాలను చిత్రీకరిస్తాం’’ అన్నారు నిర్మాతలు.

మరిన్ని వార్తలు