మరోసారి టైగర్‌గా సల్మాన్‌ ఖాన్

8 Feb, 2021 05:53 IST|Sakshi

ఏజెంట్‌ టైగర్‌గా ‘ఏక్‌ థా టైగర్, టైగర్‌ జిందా హై’ చిత్రాల్లో కనిపించారు సల్మాన్‌ ఖాన్‌. మరోసారి టైగర్‌గా మారడానికి సిద్ధమయ్యారు. మార్చిలో దుబాయ్‌లో ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం కానుంది. యశ్‌ రాజ్‌ సంస్థ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాకి మనీష్‌ శర్మ దర్శకత్వం వహించనున్నారు. కత్రీనా కైఫ్‌ కథానాయిక. మొదటి రెండు సినిమాల కంటే భారీ బడ్జెట్‌తో, భారీ యాక్షన్‌తో ఈ సినిమా ఉంటుందని టాక్‌. మార్చి మొదటివారంలో యాక్షన్‌ సన్నివేశాలతోనే చిత్రీకరణను ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది ఈద్‌ పండుగకు టైగర్‌ థియేటర్స్‌లోకి రానుంది.

మరిన్ని వార్తలు