సల్మాన్‌ ఖాన్‌ పరువునష్టం దావా కొట్టివేత

15 Jan, 2022 10:47 IST|Sakshi

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ దాఖలు చేసిన పరువునష్టం దావా పిటిషన్‌ను ముంబై సిటీ సివిల్‌ కోర్టు శుక్రవారం కొట్టివేసింది. ముంబైలోని పన్వేల్‌ ప్రాంతంలో సల్మాన్‌ ఖాన్‌ ఫాంహౌజ్‌ పక్కనే ఉన్న ఓ స్థలాన్ని ఖేతన్‌ కక్కడ్‌ అనే వ్యక్తి కొనుగోలు చేశారు.

అయితే ఖేతన్‌ కక్కడ్‌ ఓ యూట్యూబ్‌ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ తనపైనా, తన ఫాంహౌస్‌పైనా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తన పరువుకు నష్టం చేకూర్చేవిధంగా ఉన్నాయని, భవిష్యత్తులో తనపై అటువంటి వ్యాఖ్యలు చేయకుండా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని, ఇంటర్వ్యూ భాగం నుంచి ఆ వ్యాఖ్యలు తొలగించాలని కోరుతూ ముంబై సిటీ సివిల్‌ కోర్టులో పరువునష్టం వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

అయితే ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు తిరస్కరించింది. ఖేతన్‌ కక్కడ్‌పై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని, దీనిపై తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేస్తూ జడ్జి అనిల్‌ హెచ్‌ లద్దాద్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు