Samantha: అస్వస్థతతో సమంత ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు.. మేనేజర్‌ ఏం చెప్పారంటే..

24 Nov, 2022 10:14 IST|Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత ఆరోగ్యంపై మళ్లీ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఆమె అస్వస్థతతో ఆసుపత్రిలో చేరినట్టు తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఇవన్నీ వదంతులేనని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఇంట్లోనే క్షేమంగా ఉందంటూ స్పష్టం చేశారు. మరోవైపు సామ్‌ ఆరోగ్యంపై వస్తోన్న ఫేక్‌ న్యూస్‌ని నమ్మోద్దని ఆమె మేనేజర్‌ కోరాడు.

(చదవండి: సమంత ‘యశోద’కు భారీ షాక్‌.. ఓటీటీ విడుదల ఆపాలంటూ కోర్టు ఆదేశం!)

కాగా కొద్ది రోజులుగా సామ్ మయోసైటిస్ అనే సమస్యతో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. అనారోగ్యంతో ఉన్నప్పటికీ.. యశోద సినిమాకు డబ్బింగ్‌ చెప్పారు. ఈ చిత్రం నవంబర్‌ 11న థియేటర్స్‌లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహించారు.

మరిన్ని వార్తలు