Agni Nakshatram: తెలుసా తెలుసా పాట రిలీజ్‌ చేసిన సమంత

9 Mar, 2023 18:23 IST|Sakshi

మంచు మోహన్‌బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న కలిసి నటించిన తొలి చిత్రం 'అగ్ని నక్షత్రం'. వంశీక్షష్ణ మళ్ల దర్శకత్వం వహంచారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, మంచు ఎంటర్‌టైన్స్‌మెంట్స్‌ బ్యానర్లపై మంచు మోహన్‌ బాబు, మంచు లక్ష్మీ నిర్మించిన ఈ సినిమా లోని 'తెలుసా తెలుసా...' పాటను ఉమెన్స్ డే సందర్బంగా  హీరోయిన్ సమంత తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ పాటకు ప్రేక్షకులు నుంచి మంచి స్పందన వస్తోంది.

ఈ పాటలో లక్ష్మీ ప్రసన్నతో పాటు ఆమె తనయ విద్యా నిర్వాణ కూడా కనువిందు చేయడం విశేషం. త్వరలో ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నారు. ప్రముఖ మలయాళ నటుడు సిద్ధిక్, యువ హీరో విశ్వంత్, చైత్ర శుక్లతో పాటు భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కుతుండగా అచ్చు రాజమణి సంగీతం సమకూరుస్తున్నారు.

మరిన్ని వార్తలు