Samantha: 'నేను మనిషిని.. నిర్ణయించుకున్నా.. ప్రేమిస్తున్నాను'..

2 Nov, 2021 12:14 IST|Sakshi

Samantha Says Iam Strong In Note Post After Split With Naga Chaitanya: సమంత సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలి కాలంలో ఆమె షేర్‌ చేస్తున్న పోస్టులు తెగ వైరల్‌ అవుతున్నాయి. నాగ చైతన్యతో విడాకులకు కొన్ని రోజుల ముందు నుంచి మై మమ్మా సెయిడ్‌(మా అమ్మ చెప్పింది)అంటూ వరుస పోస్టులు షేర్‌ చేసిన సమంత తాజాగా మరో ఫోటోను షేర్‌ చేసింది.చదవండి: అప్పుడే మనిషి నిజస్వరూపం బయటపడుతుంది: సమంత


'ఎన్ని కష్టాలు ఎదురైనా జీవితంలో మళ్లీ నిలబడేంత సత్తా ఉంది. నేను బలవంతురాలిని. ఇతరులకు నేను పర్‌ఫెక్ట్‌ కాకపోవచ్చు. కానీ నాకు నేను పర్‌ఫెక్ట్‌. నేను ప్రేమిస్తున్నాను. ఈ విపత్కర పరిస్థితుల్లోంచి నేను విజయం సాధిస్తాను. నేను మనిషిని. నేను యోధురాలిని మా అమ్మ చెప్పింది' అంటూ సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ రాసుకొచ్చింది.

ప్రస్తుతం సామ్‌ షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చైతూ విడాకుల అనంతరం సమంత బాగా కుంగిపోయిందని, ఆమె ఇన్‌స్టా పోస్టుల్లో ఏదో తెలియని బాధ కనిపిస్తుందంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

చదవండి:నాగచైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను డిలీట్‌ చేసిన సమంత
కొన్నిసార్లు కలపడం కంటే వదిలేయడమే బెటర్‌: సామ్‌ ఆసక్తికర వీడియో

మరిన్ని వార్తలు