Samantha: నా పిచ్చికి, బాధకు అదే మందు: సమంత ఆసక్తికర పోస్ట్‌

6 Jan, 2023 14:11 IST|Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం మయోసైటిస్‌ వ్యాధితో పోరాడుతున్న సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబర్‌ తాను మయోసైటిస్‌తో బాధపడుతున్నానని చెప్పి అందరికి షాకిచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న కొద్ది రోజులుగా ఇంటికే పరిమితమైంది. ఆస్పత్రి బెడ్‌పైనే యశోద మూవీకి డబ్బింగ్‌ చెప్పింది సమంత. ఇక ఆమె లేటెస్ట్‌ మూవీ శాకుంతలం షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబతోంది. ఈ నేపథ్యంలో సమంత శాకుంతలంలో తన పాత్రకు డబ్బింగ్‌ చెబుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

చదవండి: రూ. 100 కోట్ల క్లబ్‌లోకి ధమాకా.. రవితేజ కెరీర్‌లోనే తొలి రికార్డు!

శాకుంతలం సినిమాకు డబ్బింగ్‌ చెబుతున్న ఫొటో షేర్‌ చేస్తూ ఆసక్తికరంగా క్యాప్షన్‌ ఇచ్చింది. ‘నా పిచ్చికి, బాధకు, ప్రపంచంలో కోల్పోయిన వాటన్నింటికి ఈ కళనే మందు. దాని సహాయంతో నేను నా గమ్యానికి చేరుకుంటాను’ అని రచయిత నిక్కీ రో రాసిన కోట్‌ను ఈ సందర్భంగా పంచుకుంది. ఈ పోస్ట్‌ చూస్తుంటే సమంత ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి మెరుగైనట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇవాళ ముంబై ఎయిర్‌పోర్టులో వైట్‌ సూట్‌ ట్రెండీ డ్రెస్‌లో సామ్‌ దర్శనమిచ్చింది. ఈ లుక్‌ చూసి ఆమె ఫాలోవర్స్‌ లేడీ బాస్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం మూవీ ఫిబ్రవరి 17న విడుదల కాబోతోంది. 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

మరిన్ని వార్తలు