రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో...

27 Nov, 2020 06:36 IST|Sakshi

‘వంగవీటి, జార్జి రెడ్డి’ వంటి సినిమాలతో తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో సందీప్‌ మాధవ్‌. తాజాగా ఆయన నటించనున్న సినిమాని ప్రకటించారు. ఈ చిత్రంతో రచయిత జె.వి. మధుకిరణ్‌ దర్శకునిగా పరిచయమవుతున్నారు. హల్సియన్‌ మూవీ పతాకంపై సినిమాటోగ్రాఫర్‌ అరుణ్‌ కుమార్‌ సూరపనేని ఈ సినిమా నిర్మించనున్నారు. ‘‘రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది.

‘వంగవీటి, జార్జి రెడ్డి’ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన సందీప్‌ మాధవ్‌ ఈ సినిమాతో మరింత దగ్గరవుతారు. అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని రూపొందించనున్నాం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. కాగా.. ‘వంగవీటి’, ‘జార్జి రెడ్డి’.. ఈ రెండూ యాక్షన్‌ సినిమాలే. తాజా సినిమా రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ కాబట్టి కొత్త లుక్‌లో సందీప్‌ కనిపిస్తారని ఊహించ్చు.

మరిన్ని వార్తలు