ఆస్ప‌త్రిలో చేరిన బాలీవుడ్ న‌టుడు

9 Aug, 2020 08:47 IST|Sakshi

క‌రోనా ప‌రీక్ష‌లో నెగెటివ్‌

బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ ఆస్ప‌త్రిపాల‌య్యారు. ఛాతీ, శ్వాస‌కోశ‌ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న శ‌నివారం సాయంత్రం ముంబైలోని లీలావ‌తి ఆస్ప‌త్రిలో చేరారు. ఆయ‌నను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా నెగెటివ్ అని తేలింది. ప్ర‌స్తుతం త‌న‌ ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉందంటూ సంజ‌య్‌ సోష‌ల్ మీడియాలో అభిమానుల‌కు చెప్పుకొచ్చారు. "అంద‌రికీ ముందుగా చెప్పొచ్చేదేంటంటే నేను బాగానే ఉన్నాను. కానీ ప్ర‌స్తుతం వైద్యుల‌ ప‌ర్య‌వేక్ష‌ణ‌‌లో ఉన్నాను. కోవిడ్ ప‌రీక్ష‌లు చేయిస్తే నెగెటివ్ అని వ‌చ్చింది. లీలావ‌తి ఆసుప‌త్రిలోని వైద్యులు, న‌ర్సులు, సిబ్బంది స‌హాయ స‌హ‌కారాల వ‌ల్ల రెండు రోజుల్లో క్షేమంగా ఇంటికి చేరుకుంటాను. మీ అభిమానానికి, ఆశీర్వాదాల‌కు ధ‌న్య‌వాదాలు" అని ట్వీట్ చేశారు. కాగా సంజ‌య్ జూలై 29న త‌న పుట్టిన‌రోజును జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తున్న "కేజీఎఫ్ చాప్ట‌ర్ 2" నుంచి అరివీర భయంక‌ర‌ అధీరా లుక్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. (అదిరే అధీరా)

చ‌ద‌వండి: డబ్బావాలాలకు సాయం

మరిన్ని వార్తలు