Sathigani Rendu Ekaralu: ఓటీటీలో పుష్ప జగదీశ్‌ కొత్త సినిమా, ఆరోజు నుంచే స్ట్రీమింగ్‌

5 Mar, 2023 12:02 IST|Sakshi

పాన్‌ ఇండియా మూవీ పుష్పను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ నుంచి వస్తున్న తాజా చిత్రం సత్తిగాని రెండు ఎకరాలు. అమ్ముతడా? సస్తడా? అనేది ఉపశీర్షిక. పుష్ప ఫేమ్‌ జగదీశ్‌ భండారి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం కొల్లూరు బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుంది. వెన్నెల కిశోర్‌ సహా పలువురు నటీనటులు ముఖ్య పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌కు ఇదే తొలి తెలుగు ఓటీటీ సినిమా కావడం విశేషం.

తాజాగా ఓ సినిమా ఓటీటీ విడుదల తేదీ ప్రకటించారు. మార్చి 17 నుంచి ఈ మూవీ ఆహాలో ప్రసారం కానున్నట్లు వెల్లడించారు. మంచి కామెడీ సినిమా కోసం ఎదురుచూస్తున్నవాళ్లు మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానున్న సత్తిగాని రెండు ఎకరాలు చూసి ఆస్వాదించేయండి.

మరిన్ని వార్తలు