Gurthunda Seethakalam In OTT : ఓటీటీలోకి వచ్చేసిన 'గుర్తుందా శీతాకాలం'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే

20 Jan, 2023 16:39 IST|Sakshi

సత్యదేవ్‌, తమన్నా జంటగా నటించిన చిత్రం గుర్తుందా శీతాకాలం. నాగశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. రిలీజ్‌కు ముందు పాజిటివి బజ్‌ క్రియేట్‌ అయినా ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది.

ఇక తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. శుక్ర‌వారం (నేడు)నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది. ముందుగా ఎలాంటి అప్‌డేట్‌ లేకుండా డైరెక్టర్‌గా ఓటీటీలో రిలీజ్‌ చేశారు. మరి థియేటర్‌లో సినిమాను మిస్‌ అయినవాళ్లు ఓటీటీలో చూసేయండి మరి. 
 

మరిన్ని వార్తలు