నటుడు సత్యదేవ్, తమన్నా జంటగా నటించిన చిత్రం గుర్తుందా శీతాకాలం. నాగశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను భావన రవి, నాగ శేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్.ఎస్. రెడ్డి, చినబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హీరోయిన్ మేఘా ఆకాష్, కావ్యశెట్టి తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది.
జూలై 15న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదల కానుందని మేకర్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది. సోమవారం సత్యదేవ్ పుట్టినరోజును పురస్కరించుకుని కొత్త రిలీజ్ డేట్తో కూడిన పోస్టర్ వైరల్గా మారింది. ఒకవేళ అదే నిజమైతే ఆగస్టు 5న గుర్తుందా శీతాకాలంతో పాటు కల్యాణ్ రామ్ బింబిసార, సీతారామం చిత్రాలు రిలీజ్ కాబోతుండటం గమనార్హం.
Wishing Our Hero & Supremely Talented @ActorSatyaDev a very Happy Birthday 🤩❤️
🎉🤗 - Team #GurtundaSeethakaalam@tamannaahspeaks @nagshekar @akash_megha @SriVedaakshara @kaalabhairava7 @IAmKavyaShetty @nagshekarmov @anandaudioTolly#HBDSatyaDev pic.twitter.com/OHcawJFb9S
— Vamsi Kaka (@vamsikaka) July 4, 2022
చదవండి: పద్మశ్రీ గ్రహిత, ప్రముఖ దర్శకుడు కన్నుమూత..
పిల్లల్ని కనడం గురించి సద్గురును అడిగిన ఉపాసన, ఆయన సమాధానమేంటంటే?