పనులు ప్రారంభం

21 Nov, 2022 04:16 IST|Sakshi

మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్‌ పనులు ప్రారంభమైనట్లు పేర్కొన్నారు రాజమౌళి. ‘‘నా సినిమాలకు మా నాన్నగారు (ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌) కథలు అందిస్తుంటారు. నేను ఎప్పట్నుంచో ఓ అడ్వెంచర్‌ స్టోరీ చేయాలనుకుంటున్నాను.

రెండు నెలల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్స్‌ మొదలయ్యాయి’’ అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి పేర్కొన్నారు. దీంతో ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు