Seenu Ramaswamy: 'ఎన్ని విభేదాలు ఉన్నా ప్రమోషన్స్‌లో పాల్గొనాలి'..

14 Mar, 2022 13:07 IST|Sakshi

ఎలాంటి విభేదాలు ఉన్నా చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాల్లో హీరో పాల్గొనకపోవడం కరెక్ట్‌ కాదని దర్శకుడు శీను రామస్వామి పేర్కొన్నారు. ఎక్సట్రా ఎంటర్‌టైన్‌మెంట్‌ మదియళగన్‌ నిర్మించిన చిత్రం కల్లన్‌. కరు.పళనియప్పన్‌ కథానాయకుడిగా పరిచయం చేస్తూ రచయిత్రి పాత్రికేయురాలు చంద్ర తంగరాజ్‌ తొలిసారిగా మెగాఫోన్‌ పట్టి తెరకెక్కించిన చిత్రం ఇది.

కే సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 18న థియేటర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర ఫస్ట్‌ కాపీ చూసిన వెంటనే పీకాక్‌ పిక్చర్స్‌ అధినేత ఎస్‌ ఎస్‌ కుమరన్‌ విడుదల హక్కులను సొంతం చేసుకోవడం విశేషం. కాగా శనివారం సాయంత్రం చెన్నైలో జరిగిన చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న దర్శకుడు శీను రామస్వామి. ఈ వేడుకలో కథానాయకుడు కరు.పళణియప్పన్‌ పాల్గొనకపోవడం కరెక్ట్‌ కాదన్నారు.

ఎన్ని విభేదాలు ఉన్నా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందన్నారు. దర్శకురాలు అవ్వాలన్న తన 20 ఏళ్ల కల ఈ చిత్రం అని డైరెక్టర్‌ చంద్ర తంగరాజ్‌ పేర్కొన్నారు. 100 మంది నిర్మాతలు తిరస్కరించిన ఈ కథను విన్న మదియళగన్‌ వెంటనే నిర్మించడానికి సమ్మతించారని తెలిపారు. 

మరిన్ని వార్తలు