యాక్షన్‌ ఇన్‌ బూర్జ్‌ ఖలీఫా

2 Feb, 2021 01:29 IST|Sakshi

రెండేళ్ల విరామం తర్వాత షారుక్‌ ఖాన్‌ చేస్తున్న చిత్రం ‘పతాన్‌’. ఇందులో దీపికా పదుకోన్‌ కథానాయిక. జాన్‌ అబ్రహామ్‌ విలన్‌గా నటిస్తున్నారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భారీ యాక్షన్‌ ఉంటుంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. ప్రపంచంలోనే ఎత్తయిన భవనం బూర్జ్‌ ఖలీఫాలో ఓ యాక్షన్‌ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి ప్లాన్‌ చేశారట ‘పతాన్‌’ చిత్రబృందం. బూర్జ్‌ ఖలీఫాలో చిత్రీకరణ జరుపుకోనున్న తొలి భారతీయ సినిమా ఇదే కావడం విశేషం. గతంలో ‘మిషన్‌ ఇంపాజిబుల్, ఫాస్ట్‌ అండ్‌ ప్యూరియస్‌’ వంటి హాలీవుడ్‌ సినిమాలను ఈ భవనంలో చిత్రీకరించారు. ‘పతాన్‌’ సినిమా ఈ ఏడాది చివర్లో థియేటర్స్‌లోకి రానుంది.

మరిన్ని వార్తలు