-

Shakira: కొడుకుతో పార్క్‌కు వెళ్లిన షకీరా.. ఒక్కసారిగా అడవి పందుల దాడి

2 Oct, 2021 14:01 IST|Sakshi

కొలంబియన్‌ పాప్‌ సింగర్‌ షకీరా పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే ఆమెపై ఇటీవల రెండు అడవి పందులు దాడి చేసినట్లు గాయని సోషల్‌ మీడియాలో తెలిపింది.  ఈ విషయం గురించి చెబుతూ మురికిగా, చిరిగిన తన బ్యాగ్‌ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్‌ చేసింది.

కొడుకుతో కలిసి సేద తీరడానికి బార్సీలోనాలోని ఓ పార్క్‌కి వెళ్లగా, ఆ సమయంలో ఒక్కసారిగా రెండు అడవి పందులు అక్కడికి వచ్చి ఆమెపై దాడికి దిగాయని షకీరా తెలిపింది. తన బ్యాగ్‌ని, ఫోన్‌ నోట కరుచుకుని అడవిలోకి తీసుకెళ్లడానికి ​ప్రయత్నించాయని, అంతే కాకుండా అందులోని అన్ని వస్తువులను నాశనం చేశాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అయితే దాడి అనంతరం చిరిగిపోయిన బ్యాగ్‌ను తీసుకున్న ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్‌ చేసింది.

చదవండి: ‘గాంధీ’ అంత్యక్రియల సీన్‌కి 4 లక్షల మంది భారతీయులు: హాలీవుడ్‌ నటుడు

మరిన్ని వార్తలు