తిరుపతిలో శ్రీకారం

9 Oct, 2020 01:17 IST|Sakshi

శర్వానంద్, ప్రియాంక అరుళ్‌మోహన్‌ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీకారం’. కిశోర్‌ .బి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత గురువారం ‘శ్రీకారం’ చిత్రం షూటింగ్‌ను పునః ప్రారంభించారు. తిరుపతిలో షూటింగ్‌ జరుగుతోంది. హీరో, హీరోయిన్లు, సీనియర్‌ నరేశ్‌లతో పాటు మరికొంతమంది నటులు ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ. జె. మేయర్, మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, కెమెరా: జె. యువరాజ్, ఆర్ట్‌: అవినాశ్‌ కొల్లా.

మరిన్ని వార్తలు