Sharwanand Car Accident: శర్వానంద్‌ క్షేమంగా ఉన్నారు..ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు

28 May, 2023 11:34 IST|Sakshi

శర్వానంద్‌ రోడ్డు ప్రమాదంపై ఆయన టీమ్‌ స్పందించింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, అందరూ క్షేమంగా ఉన్నారని వెల్లడించింది. ‘శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు ఫిల్మ్ నగర్‌ జంక్షన్ దగ్గర అదుపు తప్పిన సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అందరూ క్షేమంగా ఉన్నారు. కారుకి మాత్రం చిన్న గీతలు పడ్డాయి. చాలా స్వల్ప సంఘటన. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు’  అంటూ శర్వానంద్‌ టీమ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. 

కాగా, ఆదివారం తెల్లవారు జామున శర్వానంద్‌ ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌ జంక్షన్‌ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. రాంగ్‌ రూట్‌లో వస్తున్న బైక్‌ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో శర్వాకు స్పల్ప గాయాలు అయినట్లు తొలుత ప్రచారం జరిగింది. ఆయనను ఆస్పతికి తరలించినట్లు కూడా వార్తలు వినిపించాయి. కానీ అది అవాస్తవం అని, శర్వానంద్‌ క్షేమంగా ఉన్నారని ఆయన టీమ్‌ వెల్లడించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 

మరిన్ని వార్తలు