Mahesh Babu: ‘సర్కారి వారి పాట’ సెట్‌లో ఎంపీ శశిథరూర్‌..

8 Sep, 2021 20:51 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. ప్రస్తుతం ఈ మూవీలో హైదరాబాద్‌ షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఈ రోజు మాదాపూర్‌లోని ఓ స్టార్‌ హోటల్లో మూవీ షూటింగ్‌ జరిగింది. అయితే షూటింగ్‌ సెట్‌లోకి ఆకస్మాత్తుగా కాంగ్రెస్‌ సీనియర్‌ ఎంపీ శ‌శి థరూర్‌ ప్రత్యక్షం అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా శశి థరూర్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.

చదవండి: ఆర్‌సీ 15 కాన్సెప్ట్‌ పోస్టర్‌కు డైరెక్టర్‌ ఎంత ఖర్చు పెట్టించాడో తెలుసా!

ఆయన ట్వీట్‌ చేస్తూ ‘ఈ రోజు మాదాపూర్‌లోని ట్రిడెంట్‌ హోటల్లో ‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్‌ను జరుపుకుంది.అది తెలిసి నేను నా సహా ఉద్యోగులతో కలిసి వెళ్లి మహేశ్‌ను కలిశాను. మా వెంట ఆయన బావ గల్లా జయదేవ్‌ కూడా ఉన్నారు. ఆయనను కలిసి కాసేపు మాట్లాడాను. నిజంగా ‘సూపర్‌ స్టార్‌’ ఎంత గొప్ప వ్యక్తి. ఆయనను ఇలా కలుసుకోవడం సంతోషంగా ఉంది’ అంటూ రాసుకొచ్చారు. అలాగే మరో ట్వీట్‌లో మహేశ్‌తో మాట్లాడుతున్న వీడియోను షేర్‌ చేశారు.

చదవండి: ఆర్జీవీతో అశు బోల్డ్‌ ఇంటర్వ్యూ చూసిన ఆమె తల్లి రియాక్షన్‌ చూశారా!

అంతేగాక అదే సమయంలో ఆయన విలన్‌లతో పోరాడే సన్నివేశాలను పూర్తి చేసినట్లు ఈ సందర్భంగా థరూర్‌ పేర్కొన్నారు. కాగా ఈ చిత్రంలో మహేశ్‌ సరసన కీర్తి సూరేశ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 ప్లస్‌ రీల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్‌ స్వరాలు సమకురుస్తున్నాడు. 2022 జనవరి 13న సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వార్తలు