ఎఫ్‌టీఐఐ ప్రెసిడెంట్‌గా శేఖర్‌ కపూర్‌

1 Oct, 2020 08:03 IST|Sakshi

ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు శేఖర్‌ కపూర్‌కి కొత్త బాధ్యత లభించింది. ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌టీఐఐ)కు ప్రెసిడెంట్‌గా ఆయన నియమితులయ్యారు. కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. ‘‘ఇదో సరికొత్త బాధ్యత. అందరి సహకారంతో ముందుకెళ్లాలనుకుంటున్నాను’’ అన్నారు శేఖర్‌ కపూర్‌. మార్చి 2023 వరకూ ఆయన పదవీకాలం కొసాగుతుంది.

మరిన్ని వార్తలు