Shriya Saran: సినిమా చూసేందుకు ఆటోలో వచ్చిన స్టార్‌ హీరోయిన్‌

10 Dec, 2021 16:00 IST|Sakshi

Shriya Came to Mallikarjuna Theater in Auto Video: ప్రముఖ నటి శ్రియ సరన్‌ చాలా గ్యాప్‌ తర్వాత ‘గమనం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తోంది. ఆమె తాజాగా నటించిన ఈ మూవీ నేడు(డిసెంబర్‌ 10) థియేటర్లో విడుదలైంది. ఈ నేపథ్యంలో ఆమె కుకట్‌పల్లి మల్లిఖార్జున థియేటర్లో సందడి చేసింది. కాగా థియేటర్‌కు శ్రియా ఆటోలో రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. కూకట్‌పల్లి దగ్గర నిజాంపేట్‌ క్రాస్‌ రోడ్‌ వద్ద ఉన్న మల్లీఖార్జున థియేటర్‌కు ఆమె సినిమా చూసేందుకు వచ్చింది.

చదవండి: బిగ్‌బాస్‌పై యాంకర్‌ రవి తల్లి షాకింగ్‌ కామెంట్స్‌

ఈ నేపథ్యంలో ఆమె ఆటోలో థియేటర్‌కు రావడం అక్కడి వారందరిని ఆశ్చర్యపరిచింది. కాసేపటికి క్రితమే ఆమె ఆటోలో థియేటర్‌కు చేరుకుంది. సుజనా రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను రమేష్‌ కరుటూరి నిర్మించాడు. సామాజికంగా వెనుకబడిన ముగ్గురు యువతుల  జీవితాల చుట్టు తిరిగే కథాంశంతో ఈ చిత్రం తెరక్కింది. ఇందులో శ్రియ సరన్‌, నిత్యామీనన్‌, ప్రియాంక జ‌వాల్క‌ర్ ప్రధాన పాత్రలు పోషించగా శివ కందుకూరి, బిత్తిరి సత్తి తదితరులు నటించారు.

మరిన్ని వార్తలు