Shruti Haasan: చిరంజీవికి హ్యాండ్‌ ఇచ్చిన శ్రుతి హాసన్‌

8 Jan, 2023 16:19 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ వాల్తేరు వీరయ్య ‍సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నేడు విశాఖపట్నంలో గ్రాండ్‌గా జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చిరంజీవి దంపతులు, రవితేజ, దేవిశ్రీప్రసాద్‌తోపాటు దర్శకనిర్మాతలు ప్రత్యేక విమానంలో విశాఖపట్నంకు చేరుకున్నారు. కానీ హీరోయిన్‌ శ్రుతిహాసన్‌ మాత్రం ఎక్కడా కనిపించలేదు. అసలు సిసలైన మాస్‌ ఈవెంట్‌కు డుమ్మా కొట్టేసింది. ఇందుకు గల కారణాన్ని సోషల్‌ మీడియాలో రాసుకొచ్చిందీ బ్యూటీ. తనకసలు ఆరోగ్యం బాగోలేదని, ఇది కరోనా కాకకపోతే బాగుండంటూ ఓ ఫోటో పోస్ట్‌ చేసింది.

మరో స్టోరీలో.. 'అనారోగ్యం కారణంగా వాల్తేరు వీరయ్య గ్రాండ్‌ ప్రీరిలీజ్‌​ ఈవెంట్‌లో పాల్గొనలేకపోతున్నాను. ఇందుకు చాలా బాధగా ఉంది. నేను మీ అందరినీ మిస్సవుతున్నాను. ఈ సినిమాలో చిరంజీవిగారితో పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈరోజు ఈవెంట్‌ను విజయవంతం చేయండిస అని రాసుకొచ్చింది శ్రుతిహాసన్‌.

చదవండి: అప్పుడు మీ టికెట్‌ కోసం కొట్టుకునేవాళ్లం: చిరుపై శేష్‌ ఎమోషనల్‌

మరిన్ని వార్తలు