Shruti Hassan: కరోనా వల్ల ఒకరిని పోగొట్టుకుని బాధ అనుభవించా..

27 Dec, 2021 07:53 IST|Sakshi

‘కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గలేదు కాబట్టి ఎవరూ తేలికగా తీసుకోవద్దు’ అని హీరోయిన్‌ శ్రుతీహాసన్‌ అన్నారు. తన తండ్రి కమల్‌హాసన్‌ కోవిడ్‌ నుంచి కోలుకుని తిరిగి ‘విక్రమ్‌’ షూటింగ్‌లో జాయిన్‌ కావడం పట్ల శ్రుతీహాసన్‌ సంతోషం వ్యక్తం చేశారు.

ఈ విషయంపై ఆమె స్పందిస్తూ– ‘‘సరైన చికిత్స అనంతరం నాన్నగారు కోవిడ్‌ నుంచి కోలుకున్నారని తెలిసి హ్యాపీ ఫీలయ్యాం. అయినా కరోనాను తేలికగా తీసుకోవద్దు. కరోనా కారణంగా నా ఫ్రెండ్‌ని కోల్పోయినప్పుడు చాలా బాధ కలిగింది. కరోనా ఎలా సోకుతుందో చెప్పడానికి స్పష్టమైన అంశాలు లేవు. మనం జాగ్రత్తగా ఉండాలి. వ్యాక్సిన్‌ వేయించుకున్నవారికి కరోనా సోకినా దాని ప్రభావం తక్కువగా ఉంటుందని నమ్ముతున్నాను.. అందుకే అందరూ తప్పకుండా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని కోరుతున్నాను’’ అన్నారు.

మరిన్ని వార్తలు