లోకం ఎలా ఉంది నాయనా?

12 Mar, 2021 01:42 IST|Sakshi

మహానేత వైయస్‌ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా ‘యాత్ర’ వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు మహీ వి. రాఘవ్‌ ఇటీవల కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. ‘సిద్దా.. లోకం ఎలా ఉంది నాయనా’ టైటిల్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం లోకం తీరు ఎలా ఉంది? అనే అంశంపై సెటైర్‌గా ఈ చిత్రకథాంశం ఉంటుంది. లేడీ ఓరియంటెడ్‌ కథగా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్‌ లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. ‘జెర్సీ’, ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా’ సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు శ్రద్ధ. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ముహూర్తం జరిగింది. రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.

మరిన్ని వార్తలు