కర్నూల్‌లో సింగర్‌ సునీత సందడి

22 Oct, 2021 10:58 IST|Sakshi

సాక్షి, కర్నూల్‌: సింగర్‌ సునీత కర్నూల్‌లో సందడి చేశారు. నగరంలోని కొత్త ప్రారంభించిన ఓ బేకరీ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హజరయ్యారు. స్థానిక గాంధీనగర్‌ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ బాలీజీ కేక్‌ వాలా బేకరీని ఆమె గురువారం ప్రారంభించారు.

చదవండి: ఈషా టాప్‌లెస్‌ ఫొటోపై ట్రోల్స్‌, నెటిజన్లకు హీరోయిన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. నగర ప్రజలకు మంచి అభిరుచులతో పాటు నాణ్యమైన బిస్కెట్లు, కెక్స్‌, డోనట్స్‌, పేస్ట్రిస్‌, ఐస్‌క్రిమ్స్‌, మిల్క్‌షేక్స్‌ వంటి పదార్థాలను అందించడం అభినందనీయం అన్నారు. అలాగే హైదరాబాద్‌ నగరం వంటి బేకరిలో​ దొరికే పదార్థాలను ఇక్కడ అందించడం హర్షనీయం అని ఆమె పేర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమంలో బేకరి యజమాని ముప్పా రాజశేఖర్‌ రావు, కొండలరావు పాల్గొన్నారు.

చదవండి: భుజంపై భారంతో బన్నీ, ఒంటికాలుతో ప్రభుదేవా.. తగ్గేదే లే!

మరిన్ని వార్తలు