కల్యాణం... కమనీయం

2 Nov, 2020 02:41 IST|Sakshi
రాజా, వెంకట లక్ష్మీ హిమబిందు

సుప్రసిద్ధ గీత రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రెండో కుమారుడు, నటుడు రాజా (రాజా భవానీ శంకర శర్మ) వివాహం వెంకట లక్ష్మీ హిమబిందుతో ఘనంగా జరిగింది. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు దర్శకులు కృష్ణవంశీ, త్రివిక్రమ్, క్రిష్, వంశీ పైడపల్లి, నిర్మాతలు అల్లు అరవింద్, వెంకట్‌ అక్కినేని, గుణ్ణం గంగరాజు, రచయిత బుర్ర సాయిమాధవ్‌ తదితరులు విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించారు.

‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, పద్మావతి, రాజా
 

మరిన్ని వార్తలు