సాక్షి, చెన్నై: ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తాజా హెల్త్ బులిటెన్ను ఎంజీఎం ఆసుపత్రి విడుదల చేసింది. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపింది. జాతీయ, అంతర్జాతీయ డాక్టర్ల పర్యవేక్షణలో ఎస్పీ బాలుకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. వెంటిలేటర్, ఎక్మో సపోర్ట్ ద్వారా ఆయనకు ఆక్సిజన్ అందిస్తున్నట్లు తెలపారు. ఆయన ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఎంజీఎం యాజమాన్యం వెల్లడించింది. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.