Kalyan Dev: 'తెలిసింది గోరంతే.. తెలియాల్సింది కొండంత'.. కల్యాణ్‌ దేవ్‌ పోస్టులు వైరల్‌

18 Apr, 2023 16:27 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, అల్లుడు కల్యాణ్‌ దేవ్‌ గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్న విషయం తెలిసిందే. 2016లో శ్రీజ కళ్యాణ్ దేవ్‌ల పెళ్లి జరగ్గా మనస్పర్థల కారణంగా వీరు దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరగుతుంది. ఇప్పటికే సోషల్‌ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, ఇద్దరూ కలిసున్న ఫోటోలు డిలీట్‌ చేసేయడం సహా మెగా ఫ్యామిలీలో జరిగే ఏ పార్టీలోనూ కల్యాణ్‌ దేవ్‌ కనిపించకపోవడంతో రూమర్స్‌ మొదలయ్యాయి.

కొన్నాళ్లుగా వీరిద్దరి పర్సనల్‌ లైఫ్‌పై ఇప్పుడు రకరకాల పుకార్లు వస్తున్నా మెగా ఫ్యామిలీ కానీ, ఇటు కల్యాణ్‌ దేవ్‌ కానీ ఇంతవరకు స్పందించలేదు. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ తమ రిలేషన్‌షిప్‌పై ఇన్‌డైరెక్ట్‌ హింట్స్‌ ఇస్తున్నారు. తాజాగా కల్యాణ్‌ దేవ్‌ షేర్‌చేసిన ఓ పోస్ట్‌ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది.

'ఇతరులు ఎదుర్కొంటున్న కష్టాలు, బాధల గురించి మనకు తెలిసింది గోరంత అయితే తెలియనది కొండంత. అందుకే ఎదుటి వారి పట్ల మనం దయ, జాలితో ఉండాలి అంటూ' ఓ కొట్‌ను షేర్‌చేశారు. ఇక మరొక పోస్ట్‌లో.. క్రమశిక్షణ వల్లే వచ్చే బాధ, విచారం వల్ల కలిగే బాధ ఇలా రెండుంటాయి. వాటిలో మీరు ఏది కోరుకుంటారు అంటూ కల్యాణ​ దేవ్‌ చేస్తున్న వరుస పోస్టులు నెట్టింట వైరల్‌గా మారాయి. 
 

మరిన్ని వార్తలు