టాలీవుడ్‌కు జాన్వీ కపూర్‌.. డైరెక్టర్‌ ఎవరంటే!

17 Feb, 2021 09:46 IST|Sakshi

బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఇప్పుడిప్పుడే ఓ ఇమేజ్‌ ఏర్పరచుకుంటున్నారు జాన్వీ కపూర్‌. మూడు హిందీ సినిమాలతో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నారామె. త్వరలోనే తెలుగులో ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ ఓ లేడీ ఓరియంటెడ్‌ చిత్రం తీయడానికి ప్లాన్‌ చేస్తున్నారట. ఈ సినిమాలో లీడ్‌ రోల్‌లో జాన్వీని తీసుకోవాలనుకుంటున్నారని సమాచారం. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని టాక్‌. కృష్ణవంశీ సూపర్‌హిట్‌ చిత్రం ‘అంతఃపురం’ హిందీ రీమేక్‌ ‘శక్తి: ది పవర్‌’ని ప్రముఖ నిర్మాత, జాన్వీ తండ్రి బోనీ కపూర్‌ నిర్మించారు. మరి.. కుమార్తె తెలుగు ఎంట్రీ గురించి బోనీ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

అయితే లాక్ డౌన్ సమయంలోనే ఓ కథను కృష్ణవంశీ సిద్ధం చేసుకున్నారట. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధమైందని సమాచారం. అయితే అటు బాలీవుడ్‏లో గుంజన్ సక్సేనా, ది కార్గిల్ గర్ల్ వంటి ఫీమేల్ ఓరియంటేడ్ సినిమాల్లో నటించిన జాన్వీకపూర్ అయితే ఈ స్టోరీకి సరిగ్గా సరిపోతుందని కృష్ణవంశీ భావిస్తున్నాడట. ఇప్పటికే జాన్వీ తండ్రి బోనీకపూర్‏తో చర్చించారట. అటువైటు నుంచి రావాల్సిన స్పందన కోసం వేచి చూస్తున్నారట. ఈనేపథ్యంలోనే జాన్వీ కపూర్‏ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసే ఛాన్స్ కృష్ణవంశీకే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. అటు జాన్వీ కూడా ‘గుడ్ లక్ జెర్రీ’, ‘రూహి’, ‘దోస్తానా 2’ లాంటి సినిమాలతో బిజీగా ఉన్నారు.

చదవండి: జాన్వీ కపూర్‌కు చేదు అనుభవం!
కృష్ణంరాజుతో ప్రభాస్‌.. అలా వెనక్కి వెళ్దాం!

మరిన్ని వార్తలు